వైఎస్ఆర్సిపి జిల్లా కార్యాలయంలో జరిగిన *అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు* హాజరైన.. వైసీపీ సిటీ ఇన్చార్జ్ ఎమ్మెల్సీ *పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి*
—————————————-
నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో.. జరిగిన *అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలకు* వైసీపీ జిల్లా అధ్యక్షులు *కాకాణి గోవర్ధన్ రెడ్డి* గారితో కలిసి వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇంచార్జ్ & ఎమ్మెల్సీ *పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* గారు హాజరయ్యారు.
ఈ సందర్బంగా.. జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ ను ఘనంగా సత్కరించారు.
అనంతరం ఆయా రంగాల్లో రానిస్తున్న మహిళలను.. సత్కరించి.. వారికి నేతలు అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా *పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* గారు మాట్లాడుతూ..
👉 *ప్రస్తుత సమాజంలో మహిళల పాత్ర ఎనలేనిదని కొనియాడారు..*
👉 *నేడు మహిళలు అన్ని రంగాల్లో.. పురుషులతో సమానంగా రానిస్తుండడం అభినందనీయమని తెలిపారు.*
👉 *ఒకప్పుడు మహిళ ఏ రంగంలో రాణించాలన్న పురుషుడు పాత్ర.. కొంత అవసరం ఉండేదని.. నేడు అలా కాకుండా మహిళలే ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతూ.. విజయాలను సొంతం చేసుకుంటూ.. తమకు తిరుగు లేదని చాటుకుంటున్నారని తెలిపారు.*
👉 *వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల ఆకాంక్షలకు అనుగుణంగా.. వారి నిర్ణయాలను గౌరవిస్తూ.. మహిళలను ప్రగతి పథంలో నిలిపే పార్టీ అని అన్నారు.*
👉 *వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అందుకు అనుగుణంగా మహిళలకు సంబంధించి ఎలాంటి సమస్య ఉన్న.. తక్షణమే పరిష్కరించాలన్న.. దృక్పథం కలవారని తెలిపారు.*
👉 *వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు.. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు అనేక పథకాలు తీసుకువచ్చారన్నారు.*
👉 *అందులో భాగంగా ఆసరా, చేయూత, కాపు నేస్తం వంటి పథకాలతో.. మహిళలు ఆర్థికంగా పురోగతి సాధించేందుకు అవకాశం కల్పించారని గుర్తు చేశారు.*
👉 *రాబోయే రోజుల్లో కూడా మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకొని మహిళా పక్షపాతి ప్రభుత్వాన్ని సాదించుకోవాలని పిలుపునిచ్చారు.*