*ముగిసిన వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్- 2025 కార్యక్రమం*

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్- 2025 కార్యక్రమం రెండో రోజులో భాగంగా నెల్లూరు, ప్రకాశం మరియు తిరుపతి జిల్లాల నుంచి 75 మంది విద్యార్థులు పాల్గొని *ఒకే దేశం -ఒకే ఎన్నిక* అనే పోటీ అంశంపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.

ఈ కార్యక్రమానికి జ్యూరీ సభ్యులుగా ప్రొఫెసర్ విజయనంద్ కుమార్ బాబు గారు జిల్లా రిటైర్డ్ బీ.సీ వెల్ఫేర్ ఆఫీసర్ వెంకటప్పయ్య గారు నెహ్రూ యువ కేంద్ర కోఆర్డినేటర్ మహేంద్ర రెడ్డి గారు మరియు కోటా సునీల్ కుమార్ గారు వ్యవహరించారు.

అనంతరం విక్రమ సింహపురి విశ్వవిద్యాల ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు గారు వివిధ జిల్లాల నుంచి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2025 ప్రశంస పత్రాలను ను అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ జిల్లాస్థాయి యూత్ పార్లమెంట్లో పాల్గొన్న వారిలో నుంచి బాగా ప్రతిభ కనబరిచినటువంటి పదిమంది విద్యార్థులను జ్యూరీ సభ్యులచే ఎంపిక చేసి వారిని రాష్ట్రస్థాయిలో జరగబోవు వికసిత భారత్ యూత్ పార్లమెంటు కార్యక్రమానికి పంపుతామని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థులు చురుగ్గా పాల్గొని ప్రసంగించిన వారందరికీ అభినందనలు తెలియజేశారు విశ్వవిద్యాలయ రిజిస్టార్ డాక్టర్ కే .సునీత గారు మాట్లాడుతూ భవిష్యత్తులో విద్యార్థులందరూ మంచి మంచి డిగ్రీలు పొంది యూనివర్సిటీ స్థాయిలో ప్రవేశాలు పొంది జిల్లా కీర్తిని వ్యాపింప చేయాలని కోరారు.

ఈ కార్యక్రమానికి సమన్వయకర్తలుగా యూనివర్సిటీ ఎన్.ఎస్.ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ ఉదయ్ శంకర్ అల్లం మరియు డాక్టర్ బి.వి సుబ్బారెడ్డి లు నేతృత్వం వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *