
రాష్ట్ర రాజకీయాల్లో జేసీ బ్రదర్స్ తీరే సపరేటు. వాళ్లు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీని ఇరాకటంలోకి నెట్టడం వారికి మొదటి నుంచి అలవాటు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న జేసీ బ్రదర్స్ తర్వాత , టీడీపీలో కొనసాగుతున్నారు. గత టీడీపీ హయంలో సొంత ప్రభుత్వంపైనే తీవ్ర విమర్శలు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. టీడీపీ కూటమి మరోసారి అధికారంలోకి రావడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి తనదైనశైలిలో స్పందిస్తున్నారు. మద్యం సిండికెట్లో తనకు 2 శాతం వాటా చెల్లించాలని బహిరంగంగానే తెలిపారాయన.
అయితే అలా వచ్చిన డచ్చులను తాడిపత్రి అభివృద్దికే ఉపయోగిస్తానని ఆయన తెలిపారు. ఆ మధ్య రోడ్డు పక్కన ఉన్న చిరు వ్యాపారులను బెదరిస్తోన్న వీడియోలు సైతం బయటకు వచ్చాయి. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో జేసీ ప్రభాకర్ రెడ్డి వైరం పెట్టుకున్నారు. వెట్ ఫ్లై యాష్ దందా విషయంలో ఇరు నేతల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. రోజుకు రూ.5 లక్షల రూపాయిల వరకు ఆదాయం వస్తుండటంతో ఇరు నేతలు వెట్ ఫ్లై యాష్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేశారు. ఈ పంచాయితీ సీఎం చంద్రబాబు వద్దకు చేరింది. ఆయన జేసీ, ఆదినారాయణరెడ్డిలను స్వయంగా అమరావతికి కలవాలని తెలిపారు.