
*భూ బకాసురులైన ఓసీల నుంచి ఎస్సీలకు భూములు అందే వరకు పోరాటం ఆగదు : పందిటి సుబ్బయ్య మాదిగ*
*బాధితులకు న్యాయం జరిగే వరకూ ఉద్యమం : పందిటి సుబ్బయ్య మాదిగ*
చెన్నూరు గ్రామ దళితులకు వారి భూములు వారికి యధావిధిగా కేటాయించే వరకు తమ పోరాటం ఆపబోమని సీమాంధ్ర ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పందిటి సుబ్బయ్య మాదిగ పునరుద్ఘాటించారు .
శనివారం మూడవ రోజు దగదర్తి మండలం చెన్నూరు గ్రామ దళితులకు భూముల అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఆయన ధర్నా కొనసాగించారు .
భూ నిర్వాసితులతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేశారు . పట్టువదలని విక్రమార్కుడిలా తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు . అత్యధికులుగా ఉన్న ఓసీల నుంచి అల్ప సంఖ్యాక వర్గీయులుగా ఉన్న ఎస్సీల చేతికి భూములు అందే వరకు తమ పోరాటం కొనసాగిస్తామంటూ నొక్కి వక్కాణించారు .
మాల , మాదిగల ప్రయోజనాలను కాపాడేందుకు కార్యోన్ముఖులమై ముందుకెళుతున్నామని , తాము ఆశించిన ఫలితం వచ్చేవరకు విశ్రమించబోమని వెల్లడించారు . భూములు కోల్పోయిన బాధితులంతా తమ వెంట నడవాలని పిలుపునిచ్చారు .
దుర్మార్గంగా ఓసీలు , ఎస్సీలకు చెందిన భూములు లాక్కొని జల్సాలు చేస్తుంటే ప్రభుత్వo స్పందించకపోవడం ఏమిటని ప్రశ్నించారు . ఎస్సీల ప్రయోజనాలే తమకు ముఖ్యమన్నారు .
ఎస్సీల భూములు , ఓసీలు ఆక్రమించి , అనుభవిస్తున్న తీరు చూస్తే మహానుభావుడు అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి విఘాతం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు . జిల్లాస్థాయిలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రకటించారు .
బాధితులకు న్యాయం జరిగే వరకూ ఉద్యమం .
పందిటి సుబ్బయ్య మాదిగ .
చెన్నూరు గ్రామ దళితులకు వారి భూములు వారికి యధావిధిగా కేటాయించే వరకు తమ పోరాటం ఆపబోమని సీమాంధ్ర ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పందిటి సుబ్బయ్య మాదిగ పునరుద్ఘాటించారు . శనివారం మూడవ రోజు దగదర్తి మండలం చెన్నూరు గ్రామ దళితులకు భూముల అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఆయన ధర్నా కొనసాగించారు . భూ నిర్వాసితులతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేశారు . పట్టువదలని విక్రమార్కుడిలా తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు . అత్యధికులుగా ఉన్న ఓసీల నుంచి అల్ప సంఖ్యాక వర్గీయులుగా ఉన్న ఎస్సీల చేతికి భూములు అందే వరకు తమ పోరాటం కొనసాగిస్తామంటూ నొక్కి వక్కాణించారు . మాల , మాదిగల ప్రయోజనాలను కాపాడేందుకు కార్యోన్ముఖులమై ముందుకెళుతున్నామని , తాము ఆశించిన ఫలితం వచ్చేవరకు విశ్రమించబోమని వెల్లడించారు . భూములు కోల్పోయిన బాధితులంతా తమ వెంట నడవాలని పిలుపునిచ్చారు . దుర్మార్గంగా ఓసీలు , ఎస్సీలకు చెందిన భూములు లాక్కొని జల్సాలు చేస్తుంటే ప్రభుత్వo స్పందించకపోవడం ఏమిటని ప్రశ్నించారు . ఎస్సీల ప్రయోజనాలే తమకు ముఖ్యమన్నారు . ఎస్సీల భూములు , ఓసీలు ఆక్రమించి , అనుభవిస్తున్న తీరు చూస్తే మహానుభావుడు అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి విఘాతం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు . జిల్లాస్థాయిలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రకటించారు .