*భారీ వర్షాల నేపథ్యంలో నగరంలోని వివిధ డ్రైన్ కాలువల నిర్వహణ తీరును తనిఖీ చేసిన కమిషనర్ వై ఓ నందన్*

 

నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ భారీ వర్షాల నేపథ్యంలో నగరంలోని వివిధ డ్రైన్ కాలువల నిర్వహణ తీరును శనివారం తనిఖీ చేశారు.

స్థానిక సీఆర్పీ డొంక సర్వేపల్లి కాలువ మురుగునీటి ప్రవాహాన్ని పరిశీలించారు. అనంతరం ఆర్.ఎస్.ఆర్ పాఠశాల వద్ద డ్రైన్ కాలువ, ఉయ్యాల కాలువ, మల్లాపు కాలువలను పరిశీలించి మురుగునీటి ప్రవాహం సాఫీగా జరిగేలా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం, శానిటేషన్ విభాగం, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed