*బర్మాషల్ గుంట నిరుపేద దళిత, ముస్లింలకు అండగా ఆర్. పి.ఐ. జిల్లా అధ్యక్షులు ఎస్.కే.మాబు*
నెల్లూరు సిటీ రంగనాయకుల పేట రైల్వేగేట్ సమీపం రైల్వే స్థలాలలో నివాసం ఉన్నవారిని నష్టపరిహారం,పునరావాసం కల్పించకుండా తొలగిస్తామని చెప్పడం అన్యాయం…,
బర్మాషల్ గుంట వీధిలో పర్యటించి నిరుపేదలను బాధితులను పరామర్శించిన ఆర్ పి ఐ జిల్లా నాయకులు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఎస్ కే మాబు మాట్లాడుతూ
2013 భూ సేకరణ చట్టం ప్రకారం ఏ ప్రభుత్వ స్థలంలో నివాసం ఉన్నప్పటికీ వారికి నష్టపరిహారం,పునరావాసం కల్పించకుండా ఇల్లు తొలగించకూడదు కాదని అధికారహంతో తొలగిస్తే ప్రభుత్వ అధికారుల మీద న్యాయ పోరాటం చేస్తామని అన్నారు.
నిరుపేద దళితులు ముస్లింలు
100 సంవత్సరాలకు పైగా నివాసం ఉన్నారని అన్నారు వారిని దౌర్జన్యంగా తొలగిస్తామంటే ఆర్ పి ఐ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.
రంగనాయకులపేట రైలు వీధి ప్రాంతంలో గత 100 సంవత్సరాలకు పైగా నివాసం ఉన్న నిరుపేదల వద్దకు వందలాది మంది పోలీసులు రైల్వే అధికారులు దౌర్జన్యంగా వచ్చి ఇల్లు తొలగిస్తామని చెప్పడం చట్ట విరుద్ధమని అన్నారు.
2013 భూ సేకరణ చట్టం ప్రకారం ఏ ప్రభుత్వ స్థలంలో నివాసం ఉన్నప్పటికీ వారికి నష్టపరిహారం పునరావాసం కల్పించకుండా ఇల్లు తొలగించకూడదని అన్నారు.
రైల్వే స్థలాలలో నివాసం ఉన్న బాధితులు అందరికీ పూర్తిస్థాయి విచారణ జరిపి ఒక్కో కుటుంబానికి 5 లక్షల నష్టపరిహారం ఇచ్చి పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ ప్రాంతంలో అత్యంత నిరుపేదలుగా ఉన్న ముస్లిం దళితులు నివాసముంటున్నారని అన్నారు. బీడీ పని, చిన్నచిన్న కూలి పనులు చేసుకుని జీవనం సాగించేవారు ఉన్నారని అన్నారు. బలహీనుల పట్ల నిర్లక్ష్య ధోరణి అధికార అహంతో వ్యవహరిస్తే పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో
ఆర్ పి ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి పట్టపు రంగారావు జిల్లా ఉపాధ్యక్షులు బత్తల మధుసూదన్. దుంపల సుబ్బారావు. ప్రచార కార్యదర్శి ఉప్పల మాలకొండయ్య. సీనియర్ సిటిజెన్ కన్వీనర్ నిమ్మల సుబ్బయ్య.వజ్జా సుధాకర నాయకులు తదితరులు పాల్గొన్నారు