*దేశ సంపద, వనరులు, ప్రభుత్వ రంగాన్ని కార్పొరేట్లకు దోచి పెట్టడమేనా వికసిత్ భారత్ అంటే ? : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు*
*కేంద్ర బడ్జెట్ లో కేటాయింపులు – సవాళ్లు అనే అంశం పై డాక్టర్ జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రం లో ” సదస్సు” నిర్వహించిన వామపక్షాలు*
*ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు మరియు వామపక్షాల నాయకులు*
*దేశ సంపద, వనరులు, ప్రభుత్వ రంగాన్ని కార్పొరేట్లకు దోచి పెట్టడమేనా వికసిత్ భారత్ అంటే ? : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు*
*కార్పొరేట్లకు దోచిపెట్టే బడ్జెట్ గా కేంద్ర బడ్జెట్ వున్నది.*
*గ్రామీణ ఉపాధి హామీ పధకం, విద్య, వైద్యం, ఆహార సబ్సిడీ, వ్యవసాయం, ధరల స్థిరీకరణ కు భారీగా బడ్జెట్ లో కోత విధించారు.*
*పేదరికం, నిరుద్యోగం, ఆహర కొరత, రైతుల ఆత్మహత్యల లాంటి సమస్యల పరిష్కారంకు అవసరమైన కేటాయింపులు బడ్జెట్ లో లేవు.*
*పేదరికం నిరుద్యోగం వల్ల అమెరికా వెళ్లిన భారత పౌరులను సంకెళ్లతో మన దేశానికి పంపితే ప్రశ్నించే ధైర్యం లేక మోడీ మౌనం వహించడం సిగ్గు చేటు : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు*
*ప్రత్యేక హోదా లేదు. విభజన చట్టానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర బడ్జెట్ లో కేటాయింపులు లేవు*
*50 లక్షల కోట్ల బడ్జెట్ లో ప్రజల కొరకు కేటాయించిన వాటా 10 శాతం కూడా లేకపోవడం విచారకరం. కార్పొరేట్లకు రాయితీలు కల్పించడంలోనే బీజేపీ పాలకులు దృష్టి పెట్టారు.*
*ప్రజా సంక్షేమం, ఉపాధి కల్పన, విద్య, వైద్యం, వ్యవసాయం, ఆహరం సబ్సిడీ లపై కేటాయింపులు పెంచాలి*
*వామపక్షాల ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ప్రజా వ్యతిరేక బడ్జెట్ కు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తున్నాం. ప్రజలు అధిక సంఖ్యలో భాగస్వాములు కావాలి : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు*