*డిగ్రీ,పీజీ కళాశాల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే చెల్లించాలి.. *ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.*
—————————————
ఏపీ శాసనమండలి సమావేశాలలో ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ..
👉 ఈ రాష్ట్రంలో విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
👉 ఈ ప్రభుత్వం పీజీ విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామని.. వాగ్దానం చేసిందన్నారు.
👉 డిగ్రీ విద్యార్థులతో పాటు పీజీ విద్యార్థులు.. 40 వేల మంది ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు..ఇంకా పెండింగ్ లో ఉండటం వల్ల కళాశాలలో సర్టిఫికెట్లు కూడా తీసుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
👉 వారందరికీ ఎప్పటిలోగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తారని ప్రశ్నించారు.
👉 UG కోర్సులు చదువుతున్న విద్యార్థులకు 4200 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించాల్సి ఉందని తెలిపారు.
👉 ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు అందక దాదాపుగా 13 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
👉 ఈ రోజు 2 వేల కోట్లు వసతి దీవెనకు… హాస్టల్ ఫీజులు కూడా పెండింగ్లో ఉన్నాయని తెలిపారు.
👉 టిడిపి ప్రభుత్వంలో 2018-19 కి సంబందించి 1880 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉంటే.. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత.. 2019-20..కి ఫీజు రీయింబర్స్మెంట్ నిధులతో పాటు.. పాత బకాయిలను కలిపి 4200 కోట్ల రూపాయల ఒకేసారి జమ చేయడం జరిగిందన్నారు.
👉 క్రమం తప్పకుండా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించిన ప్రభుత్వం.. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని గుర్తు చేశారు
👉 విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా వాటిని త్వరగా చెల్లించి.. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని.. ప్రభుత్వాన్ని కోరారు.
👉 ప్రస్తుతం మన రాష్ట్రంలో జిల్లా పరిషత్ లో హైస్కూల్ + పాఠశాలలు ప్రభుత్వ విద్యా వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తున్నయాన్నారు.
👉 గత వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పేద గ్రామీణ ఆడపిల్లలకు అందుబాటులో జూనియర్ కళాశాల ఉండాలన్న సంకల్పంతో 292 హైస్కూల్ + పాఠశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.
👉 హై స్కూల్ ప్లస్ పాఠశాలల మూలంగా అర్హత కలిగిన ఉపాధ్యాయులకు పీజీటీ లుగా ప్రమోషన్ లు కల్పించామని తెలిపారు.
👉 ఆ తరువాత సంవత్సరం 2024 లో మరో 210 కో ఎడ్యుకేషన్ పాఠశాలను హై స్కూల్ ప్లస్ గా ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.
👉 అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇందులో విద్యార్థులు చేరినప్పటికీ staff నియామకాలు చేపట్టకుండా వాటిని నిర్వీర్యం చేసిందన్నారు.
👉తద్వారా చాలా మంది ఆడ పిల్లలు ఇంటర్ విద్యకు దూరమయ్యారని తెలిపారు.
అయితే, ఇప్పుడు పిల్లలు తక్కువగా ఉన్నారన్న కారణంగా జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో ఉన్న మొత్తం 502 హై స్కూల్ ప్లస్ పాఠశాలలనే రద్దు చేస్తామని ప్రభుత్వం చెప్పడం సరికాదన్నారు.
👉 ఇది పేద విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపిస్తుందన్నారు
👉 ఈ నేపథ్యంలో హైస్కూల్ + పాఠశాలలుగా అయినా లేదా
వాటిని *జిల్లా పరిషత్ జూనియర్ కళాశాలలుగా* అయిన పేరు మార్చి అలానే కొనసాగించడం తో పాటు మిగిలిన 210 హై స్కూల్ ప్లస్ లలో కూడా పీజీటీ ల నియామకం జరిపి , పేద, బడుగు, బలహీన గ్రామీణ విద్యార్థులకు ఇంటర్ విద్యను చేరువ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.