*జాతీయ జెండా వందన కార్యక్రమం నిర్వహించిన బిజెపి శ్రేణులు*
మహిళల కంట కన్నీరు పెట్టించిన ఉగ్రవాదులను మహిళా కమాండోలే హతమార్చారు…. మిడతల రమేష్

ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసి దేశ ప్రజలకు ఇచ్చిన మాట మోడీ నిలబెట్టుకున్నారు….. కందికట్ల రాజేశ్వరి
ఆపరేషన్ సింధూర్ విజయవంతం పై జాతీయ జెండా వందనం కార్యక్రమాన్ని బిజెపి నేతలు నిర్వహించారు

నెల్లూరు మూలపేట అలంకార్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో బిజెపి నేత మిడతల రమేష్ మాట్లాడుతూ
మహిళల నుదుట సింధూరాన్ని తు డిచేసిన ఉగ్రవాదులను మహిళా కమాండోల నాయకత్వంలో ఆపరేషన్ సిందూర్ తో ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశారు.

ఉగ్రవాదాన్ని పెంచడం లక్ష్యంగా రూపొందిన పాకిస్తాన్ కు ఈ సైనిక దాడి హెచ్చరిక లాంటిది.
భారత్లో విధ్వంసం సృష్టించి పాకిస్తాన్లో సురక్షితంగా నిద్రపోవచ్చు అనే బ్రాంతిని ఆపరేషన్ సింధూర్ తుడిచిపెట్టింది.

ఇప్పటికి కూడా బుద్ధి మారని *పాకిస్తాన్ సైనికులు భారత పౌరులు 12 మందిని కాల్చి చంపారు*.
అమరులైన భారత పౌరులకు బిజెపి నేతలు సంతాపం ప్రకటించారు

*బిజెపి రాష్ట్ర కార్యదర్శి కందికట్ల రాజేశ్వరి* మాట్లాడుతూ భారత్ ను తక్కువ అంచనా వేసుకొని పాకిస్తాన్ రోజు బెదిరిస్తూ ఉంది. మోడీ నాయకత్వంలో హిందువులను కాల్చి చంపిన తీవ్రవాదులు ఎక్కడ ఉన్నా వెంటాడి మట్టిలో కలిపేస్తానని మోడీ చెప్పారు..

ఇచ్చిన మాట ప్రకారం మనపై జరిగిన ఉగ్రదాడికి ప్రధాని మోడీ ప్రతీకారం తీర్చుకొని తీర్చుకొని భారత సైనిక శక్తిని ప్రపంచానికి చాటారు.భారత్ అంటే ఏమిటో పాకిస్తాన్ తెలియజేశారని అన్నారు. ఇప్పటికైనా ఉగ్రవాదుల ను పోషించడం పాకిస్తాన్ మానుకోవాలన్నారు

ఈ కార్యక్రమంలో పద్మావతి. నాగలక్ష్మి. సరస్వతి. ఏవి సుబ్బయ్య. రఘురామయ్య.చిట్టిబాబు. వీర రాఘవులు. నరాల సుబ్బారెడ్డి. పి శ్రీనివాసులు. త్రిబువన్. నారాయణ. మా రామకృష్ణ. లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *