*క్రీడలు మనోబలాన్ని పెంచుతాయి*

– మహిళా ఉద్యోగుల క్రీడా పోటీల బహుమతి ప్రదానోత్సవంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.

క్రీడలు శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, మానసిక ఒత్తిడిని నుంచి దూరం కావడానికి సహాయ పడతాయన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నెల్లూరు నగరంలో ఎన్జిఓ హోమ్ లో నిర్వహించిన మహిళా ఉద్యోగుల క్రీడా పోటీల విజేతలకు ఆమె బహుమతి ప్రదానోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు మాట్లాడుతూ క్రీడా పోటీల్లో గెలుపోటములు సహజమేనని, గెలవాలి అని కృషితో ముందుకు సాగడంలోనే నిజమైన విజయం ఉంటుందన్నారు. క్రీడలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే కాకుండా, టీమ్ స్పిరిట్‌ను పెంచుతాయన్నారు. ఈ బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం ద్వారా విజేతలను గౌరవించడమే కాదు మహిళల క్రీడాస్ఫూర్తిని సన్మానించు కుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ, జిల్లా ఆరోగ్యశాఖాధికారి వి సుజాత, ఉద్యోగుల సంఘ రాష్ట్ర నాయకులు కర్నాటి వెంకట శివారెడ్డి,రామకృష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *