*కారు ప్రమాదంలో ఐదుగురు వైద్య విద్యార్ధుల మృతిపై ఆదాల దిగ్భ్రాంతి*

నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం వద్ద జరిగిన కారు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడంపై *నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి* బుధవారం ఒక ప్రకటనలో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమని మాజీ ఎంపీ ఆదాల ప్రకటనలో విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, వారి కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేసి, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed