*సెకీతో ఒప్పందం 30 ఏళ్లు పూర్తయ్యేసరికి జగన్ రెడ్డి ముత్తాతవుతాడు : సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*
*అవినీతిలో ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగిన ఆయన ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పాలి*
*దేశ చరిత్రలోనే జగన్ రెడ్డిలా అవినీతికి పాల్పడిన ముఖ్యమంత్రి లేరు*
*విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేసిన వైసీపీ ధర్నాల పేరుతో రోడ్డెక్కడం సిగ్గు చేటు*
*నెల్లూరులోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో పొలిట్ బ్యూరో సభ్యులు, సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*
కరెంట్ చార్జీల విషయంలో వైసీపీ రోడ్డెక్కి ధర్నాలు చేయడం నవ్విపోదురు గాక నాకేంటి అన్నట్టుగా ఉంది
జగన్ రెడ్డి రూ.1.29 లక్షల కోట్ల భారాన్ని విద్యుత్ సంస్థలపై మోపి మొన్న ఇంటికి పోయాడు
ఐదేళ్లలో 10 సార్లు విద్యుత్ చార్జీలను పెంచి ప్రజలపై రూ.32 వేల కోట్ల భారాన్ని మోపాడు
2014లో చంద్రబాబు నాయుడు సీఎంగా బాధ్యతలు చేపట్టేనాటికి 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉంది
2019లో చంద్రబాబునాయుడు అధికారం కోల్పోయే నాటికి లోటును అధిగమించి సర్ ప్లస్ కు తెచ్చారు
జగన్ రెడ్డి తాను చేసిన పాపాలను మరో 30 ఏళ్లు ప్రజలు అనుభవించాలంటున్నాడు
7 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ను యూనిట్ రూ.2.49 కొనుగోలు చేసేలా సెకీతో ఒప్పందం చేసుకున్నాడు
అదే సమయంలో గుజరాత్ రూ.1.99కే అగ్రిమెంట్ చేసుకుంది
మరో పదేళ్లకు సోలార్ పవర్ యూనిట్ రూ.1.25కి వస్తుందని విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు.
కానీ మన జగన్ రెడ్డి మాత్రం 30 ఏళ్ల పాటు రూ.2.49కే కొనుగోలు చేసేలా ఒప్పందం రాసి వెళ్లాడు
ఆ 30 ఏళ్లకు ఆయన ముత్తాత అవుతాడు..
జగన్ రెడ్డి బరితెగించి రూ.1750 కోట్లు లంచం తీసుకున్నపాపానికి ప్రజలపై అదనంగా లక్ష కోట్ల భారం
ఏపీ సీఎంగా జగన్ రెడ్డి లంచం తీసుకున్నాడని అమెరికాకు చెందిన అంతర్జాతీయ దర్యాప్తు సంస్థ ఎప్.బీ.ఐ చెప్పి నెల కాలేదు
రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను 30 ఏళ్ల గడువుకు తాకట్టుపెట్టి, ఇప్పుడు నిరసనల పేరుతో రోడ్డెక్కడానికి సిగ్గుండాలి
కేబినెట్ అప్రూవల్ లేకుండానే ఒప్పందాలు చేసి ప్రజలపై మోయలేని భారం మోపారు
జగన్మోహన్ రెడ్డి మోస్ట్ నెటోరియస్ కరప్టెడ్ లీడర్ గా అంతర్జాతీయ స్థాయికి
ఎదిగాడు
ఒక్క పవర్ ప్లాంటు నిర్మించకుండానే విద్యుత్ సంస్థల పేరుతో రూ.49 వేల కోట్లు అప్పులు చేశాడు
జగన్ రెడ్డి చుట్టూ నలుగురైదుగురు రెడ్లకు ఆదాయమే లక్ష్యంగా దోపిడీ జరిగింది
కృష్ణపట్నంలోని ఏపీ జెన్ కో థర్మల్ పవర్ ప్లాంటుకు రూ.281 కోట్ల విలువైన 4.50 లక్షల టన్నుల నాసిరకమైన బొగ్గును సరఫరా చేసి దోచుకున్నారు..
మట్టిమషానంతో కూడిన ఆ బొగ్గుతో ప్రాజెక్టు ఉనికికే ప్రమాదమని జెన్ కో ఉద్యోగులు తిరగబడిన పరిస్థితి తెచ్చారు
జగన్ రెడ్డి అవినీతి దెబ్బకు అమెరికాలోని ఎఫ్.బీ.ఐ నుంచి నేలటూరులోని జెన్ కో ఉద్యోగుల వరకు రోడ్డెక్కారు
అయినా సిగ్గుశరం లేకుండా నిరసనల పేరుతో ఊరేగింపులు చేసుకున్నారు
స్మార్ట్ మీటర్ల విషయంలోనూ దేశంలోని ఏ రాష్ట్రంలో లేకుండా ఏపీలో పెట్టేందుకు అనుమతిచ్చిన మహానుభావుడు కూడా జగన్ రెడ్డే
ఒక్కో స్మార్ట్ మీటర్ కు రాజస్థాన్ లో రూ.7943, ఛండీగర్ లో రూ.9710 ఖర్చు చేస్తే ఏపీలో మాత్రం రూ.36975 అంట
జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నందుకు ఏపీ ప్రజలు జీవితకాలం భాదపడే పరిస్థితి తెచ్చిపెట్టారు
ఇంత బరితెగించి దోపిడీకి పాల్పడిన ముఖ్యమంత్రి దేశ చరిత్రలోనే లేరు
ధనదాహంతో ఏపీలో ఐదేళ్ల పాటు వ్యవస్థలన్నింటిని నాశనం చేసేశాడు
ఇలాంటి వ్యక్తులా విద్యుత్ భారం పేరుతో ధర్నాలు, ప్రదర్శనలు చేసేది
జగన్మోహన్ రెడ్డి నాశనం చేసిన విద్యుత్ రంగాన్ని ఎలా పునరుద్ధరించాలో తెలియక కూటమి ప్రభుత్వం తలలు పట్టుకోవుంది
విద్యుత్ పేరు ఎత్తే అర్హతే వైసీపీ నాయకులకు లేదు
ప్రజలపై భారం ఎలా తగ్గించాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు.