*27న విద్యుత్ చార్జీలపై పోరుబాట*

*.మాజీ మంత్రి , వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధర్ రెడ్డి*

విద్యుత్ చార్జీల పెరుగుదలకు న,రసనగా ఈనెల 27న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పోరుబాటకు సంబంధించిన వాల్ పోస్టర్లను మంగళవారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలను పెంచబోమని చెప్పిన చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఇష్టారాజ్యంగా విద్యుత్ ఛార్జీలను పెంచుతున్నారని విమర్శించారు. నెల్లూరు జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, ఉదయగిరి నియోజకవర్గ ఇన్చార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *