
*కర్ణాటక ప్రాజెక్టుల వల్ల తెలంగాణ ఎక్కువగా నష్టపోతుంది*.
*రాజకీయ లబ్ధి కోసమే బిఆర్ఎస్ -కాంగ్రెస్ పార్టీల నేతలు ఆంధ్ర ప్రాజెక్టులపై విషం కక్కుతున్నారు*
.
*తెలంగాణ ఆంధ్ర ప్రభుత్వాలు కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలని తెలుగంగ యన్ టి పీ శేషనాగుకు బిజెపి నేత మిడతల రమేష్ విజ్ఞప్తి.*
కర్ణాటక భద్రనది డ్యాంనుండి 30 టీఎంసీలు నీటి తరలింపు పనులు పూర్తి చేసింది. ఐదు లక్షల ఎకరాలకు అదనంగా నిరంత ఇచ్చే ప్రయత్నాలు జరిగాయి.
ఆల్మట్టి ఎత్తు పెంపు వలన డ్యామ్ లో 130 టీఎంసీలు అదనంగా నిలువ చేసుకుంటరు. ఆల్మట్టి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అదనంగా 13 లక్షల ఎకరాలకు నీరు తరలించుకునేందుకు భూ సేకరణ పూర్తి చేయవచ్చింది.
ఆల్మట్టి భద్ర డ్యాముల నుండి నీరు తరలిపోతే శ్రీశైలం నాగార్జునసాగర్ కు నీటి లభ్యత తగ్గిపోతుంది.
శ్రీశైలం డ్యాం నీటి లభ్యత తగ్గడం వలన మొదటి తెలంగాణ తర్వాత రాయలసీమ ప్రాంతాలు ప్రమాదంలో పడతాయి..
వాస్తవ పరిస్థితుల మీద తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీ కానీ ప్రతిపక్ష టిఆర్ఎస్ పార్టీ గాని కర్ణాటక చర్యలపై స్పందించడం లేదు..
కాంగ్రెస్ బిఆర్ఎస్ లు కర్ణాటక అక్రమ అక్రమాలపై ఉద్యమాలు చేయకుండా ఆంధ్ర ప్రాజెక్టులపై విద్వేషాలు తో విష ప్రచారం చేస్తున్నారు..
ఆంధ్ర తెలంగాణల తెలుగు ప్రజలు ఒక్కటై కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలని రమే
చేశారు.
ఈ కార్యక్రమంలో నరాల సుబ్బారెడ్డి. రఘురామయ్య. నారాయణ. సుజనా తదితరులు పాల్గొన్నారు