*భక్త కన్నప్ప సినిమాలో గిలక పిలక అనే పాత్రలును ఖండించిన : బ్రాహ్మణ సంఘం నాయకులు డాక్టర్ రవిశంకర్ చెరువు*
సనాతన ధర్మం గురించి మాట్లాడే పెద్దలకు కొత్త సినిమా అయినా భక్త కన్నప్ప లోని గిలక పాత్రలు కనిపించలేదా.
భక్త కన్నప్ప కథకు మూల అంశము శ్రీకాళహస్తీశ్వర మహత్యం. రాసిన వ్యక్తి మహాకవి అష్ట దిగ్గజములు లో ఒకరు ధూర్జటి వారు. ధూర్జటి వారు బ్రాహ్మణులు భక్తకన్నప్ప సినిమాలో గిలక పిలక అనే పాత్రలు ఉన్నాయని చెప్పుకునే పాత్రలు కూడా బ్రాహ్మణుల వ్యక్తులే. బ్రాహ్మణులను ముఖ్యముగా అర్చకులను అపహాస్యము చేయుట ఎంతవరకు సబబు. నటులు మోహన్ బాబు గారికి బ్రాహ్మణ లను మరియు అర్చకులను అపహాసం చేయటము ఆనవాయితీగా మారిపోయింది.
అసెంబ్లీ రౌడీ సినిమాలో పంతులు పావు సేరు మెంతులు అనే పాట గానీ, అల్లరి మొగుడు సినిమాలోని చిప్పలు దోచే పూజారి అనే డైలాగ్ గాని మరియు అదిరింది అల్లుడు సినిమాలోని కథాంశంలోని ముఖ్య పాత్రల ప్రవర్తన ఉదాహరణలు. మోహన్ బాబు కుమారుడు కూడా అదే దారిలో వెళ్ళుచున్నారు.
గతంలో అతని సినిమాలో బ్రాహ్మణుల పాత్రలలలో వారు చేసిన అవమానము. తదుపరి దానిపై జరిగిన పోరాటంలో బ్రాహ్మణులను వ్యక్తిగత సిబ్బంది చేత కొట్టడం జరిగినది.
మోహన్ బాబుకు మరియు అతని కుమారునికి బ్రాహ్మణులను కించపరచడం అవమానపరచడం దినచర్యగా మారిపోయింది. సమాజంలోని పెద్దలు ఈ విషయంపై ఆలోచించి ధర్మాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇట్లు Dr. చెరువు రవిశంకర్