- *ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాఖ లో ఉన్న బ్లడ్ సెంటర్ కి రాష్ట్ర స్థాయి లో అవార్డు లబించింది. ఈ అవార్డు*
ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న ప్రపంచ రక్తదాతల దినోత్సవం June 14. ఈ రక్త దాతల దినోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాఖ లో ఉన్న బ్లడ్ సెంటర్ కి రాష్ట్ర స్థాయి లో అవార్డు లబించింది.
ఈ అవార్డు ను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి రాష్ట్ర శాఖ ఛైర్మన్ శ్రీ వై. డి. రామరావు, జెనరల్ సెక్రెటరీ & CEO శ్రీ అశ్విని కుమార్ పరీదా IAS rtd. మరియు కోశాధికారి శ్రీ రామచంద్ర రాజు వారి ఆద్వర్యంలో గుంటూరు లో భారతీయ విద్యా భవన్ లో ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య, కుటుంబ సంక్షేమం మరియు వైద్య విద్య మంత్రివర్యుల శ్రీ సత్య కుమార్ యాదవ్ గారి చేతులమీదగా 2023-24 గాను 16401 యూనిట్స్ & 2024-25 గాను 15743 యూనిట్స్ ను రక్తము సేకరించినందున రెడ్ క్రాస్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాఖ వైస్ ఛైర్మన్ శ్రీ చమర్తి జనార్ధన్ రాజు మరియు బ్లడ్ సెంటర్ కన్వీనర్ శ్రీ చంద్రగిరి అజయ్ బాబు కు అవార్డును అందచేశారు.
అనంతరం నెల్లూరు జిల్లా నందు Industry / PSU విభాగం నందు శ్రీ కౌషల్ సింగ్, safety head, adani krishnapatnam పోర్ట్, ఒక్క రోజులో అత్యధిక రక్త సేకరణ చేసినందుకు గాను శ్రీ. సురేంద్ర కుమార్ & team, Sricity Pvt. Ltd, వారికి రెండవ స్థానం నందు అవార్డును ప్రదానం చేశారు.
తదుపరి రాష్ట్ర స్థాయిలో అత్యాదికంగా (119 సార్లు) రక్త దానం చేసిన ఏకైక వ్యక్తి గా శ్రీ మదనపల్లి మధుసూదన్ రావు, రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ మోటివేటర్ కు రాష్ట్ర మంత్రివర్యులచే అవార్డును బహుకరించి ప్రశంసించారు.