*సమష్టి కృషితోనే రాష్ట్రానికి మేలు*

*రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి నారా లోకేష్*

కలిసికట్టుగా ఉండటం వల్లే విశాఖ స్టీల్ ను కాపాడుకోగలిగాం
మని, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఇకముందు కూడా ఇదే పంథా కొనసాగిద్దామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులు శ్రీనివాస వర్మ, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఇతర ఎంపీలు, బీజేపీ నేతలు మంత్రి లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే సమిష్టి కృషితో విశాఖ రైల్వే జోన్, అమరావతి, పోలవరం, స్టీల్ ప్లాంట్ కు నిధులు తెచ్చుకోగలిగామని చెప్పారు.రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర మంత్రులు, ఎంపీలు చేస్తున్న కృషిని లోకేష్ అభినందించారు. అతి తక్కువ కాలంలో విశాఖ స్టీల్ తో సహా అనే సమస్యల పరిష్కారం కావడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని లోకేష్ అన్నారు. పలు అంశాలపై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. మంత్రి నారా లోకేష్ గారితో మాట్లాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *