*టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి నామినేషన్ లో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి*
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి కావలి గ్రీష్మ నామినేషన్ దాఖలు ప్రక్రియలో మంత్రి నారా లోకేష్ గారితో కలిసి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొన్నారు.
సోమవారం అసెంబ్లీలో నామినేషన్ ప్రక్రియ జరగగా ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు.
ఆయనతో పాటు ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి పాల్గొని మద్దతు తెలియజేశారు.
నామినేషన్ వేసిన కావలి గ్రీష్మకు ప్రశాంతిరెడ్డి అభినందనలు తెలియజేశారు.