స్వయం సహాయక సంఘాలను సుస్థిర వ్యవస్థలుగా మార్చే ప్రణాళికలు అమలు

– అదనపు కమిషనర్ నందన్

పట్టణాలలోని పేద మహిళల చేత ఏర్పాటు చేసిన స్వయం సహాయ సంఘాలు, వాటి సమాఖ్యలను సుస్థిర వ్యవస్థలుగా తీర్చిదిద్ది, తద్వారా సుస్థిరమైన జీవనపాదుల కల్పన ద్వారా మహిళల కుటుంబ తలసరి ఆదాయాన్ని పెంచే ప్రణాళికలను అమలుపరిచేందుకు సిద్ధంగా ఉన్నామని నెల్లూరు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ వై.ఓ. నందన్ తెలియజేశారు.

పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) మిషన్ డైరెక్టర్ ఎం. తేజ్ భరత్ ఆధ్వర్యంలో పట్టణ స్వయం సహాయక సంఘాల మహిళలకు మెప్మా కార్యక్రమాలపై అవగాహన కల్పించేందుకు వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ నందన్, మెప్మా పి.డి.రాధమ్మ పాల్గొని వివిధ మెప్మా కార్యక్రమాలపై మహిళలకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా మిషన్ డైరెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ మెప్మా 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక ద్వారా స్వయం సహాయక సంఘాల సభ్యులు, వారి కుటుంబాలకు స్థిరమైన జీవనోపాధి అవకాశాలను సృష్టించడం ద్వారా వారి వ్యాపార సామర్థ్యాన్ని పెంపొందించి, ఆర్థిక సాధికారత కల్పించనున్నామని తెలిపారు.

అసంఘటిత రంగంలో స్వయం ఉపాధి ఇతర సేవల ద్వారా ఉపాధిని పొందుతున్న స్వయం సహాయక సంఘ సభ్యులు వారి కుటుంబ సభ్యులను సంఘటిత రంగంలోకి మార్చేందుకు మొదటి మెట్టుగా ఎం.ఎస్.ఎమ్.ఈ లుగా వారిని రిజిస్ట్రేషన్ చేయనున్నామని తెలిపారు. ఎం.ఎస్.ఎం.ఈ రిజిస్ట్రేషన్ ద్వారా వృత్తికి, వ్యాపార అభివృద్ధికి హామీలేని సబ్సిడీతో కూడిన బ్యాంకు రుణాలు, కేంద్ర ప్రాజెక్టు రుణాలు పొందేందుకు అవకాశం ఉందని వివరించారు.

చేస్తున్న వృత్తి వ్యాపారాలకు పూర్తి చట్టబద్ధత కల్పించనున్నామన్నారు. నైపుణ్య అభివృద్ధి పొందేందుకు, విస్తృతమైన మార్కెట్ ను అందుకునేందుకు, బ్రాండింగ్ సహకారం పొందడానికి రిజిస్ట్రేషన్ అవకాశం కల్పిస్తుందని వివరించారు.

ఎస్సీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ ద్వారా స్వయం సహాయక సంఘాల సభ్యులు లేదా వారి కుటుంబ సభ్యులకు రుణాలను అందించే ప్రణాళికలను సిద్ధం చేసి అమలు చేయనున్నామని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న సభ్యులకు వారి అర్హతలను నిర్దేశించిన కమిటీ పరిశీలించాక సబ్సిడీతో కూడిన రుణాలను ప్రభుత్వం మంజూరు చేస్తుందని వెల్లడించారు. రుణం పొందిన తరువాత దరఖాస్తులో పేర్కొన్న యూనిట్ ఏర్పాటు చేసుకొని కుటుంబ ఆర్థిక స్థితిని పెంచడంతోపాటుగా తలసరి ఆదాయాన్ని కూడా పెంచుకోవాలని సూచించారు. రుణాలు పొందేందుకు అవసరమైన అవగాహన కార్యక్రమాలను మెప్మా సంస్థ కల్పిస్తుందని, అన్ని విషయాలలో వారి నుంచి సహాయ సహకారాలు పొందాలని మహిళలకు సూచించారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2025 సందర్భంగా మార్చి 8వ తేదీ నాడు ఒకేరోజు లక్ష ఉత్పత్తులకు పైగా అమ్మకం జరపడం ద్వారా కోటి రూపాయలకు పైగా ఆదాయం సంఘ సభ్యులకు వచ్చేలా చేయుటకు ప్రణాళికలను సిద్ధం చేసి ఉన్నామని తెలిపారు. ఒక్కొక్క స్వయం సహాయక సంఘాల నుంచి అదే మున్సిపాలిటీ నుంచి ఓఎండిసి లో ఆన్ బోర్డ్ అయిన ఒక ప్రోడక్ట్ కొని సంఘం ఉత్పత్తులను ప్రోత్సహించుటకు ప్రణాళికను రూపొందించామని తెలిపారు.

మార్చి 8వ తేదీ నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌర ముఖ్యమంత్రి పట్టణ పురపాలక శాఖ మంత్రివర్యులు గిన్నిస్ ప్రతినిధుల సమక్షంలో లక్ష ఉత్పత్తుల అమ్మకాలు విజయవంతంగా జరపలు ఉన్నామని తెలిపారు. అన్ని మున్సిపాలిటీలలో పెద్ద స్క్రీన్ లను ఏర్పాటు చేసి అక్కడ గిన్నిస్ ప్రపంచ రికార్డును ఆన్లైన్ ద్వారా సంఘ సభ్యులు వీక్షించే సదుపాయం కల్పించనున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ టి.పి.ఆర్.ఓ బాలకృష్ణ, యస్.ఎల్.ఎఫ్.టీ.ఎల్.ఎఫ్.ఆర్.పి.సి.ఓ.సి.యం.యం సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed