*సీఎం చంద్రబాబు గారికి స్వాగతం పలికిన ఎంపీ వేమిరెడ్డి*
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్దే ధ్యేయంగా కేంద్ర మంత్రులను కలిసేందుకు ఢిల్లీ చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి స్వాగతం పలికారు. బుధవారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కు ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు.. ఎంపీ వేమిరెడ్డిని ఆప్యాయంగా పలకరించారు.