“వ్యర్ధాలతో కళాకృతుల నిర్మాణం” ప్రశంసనీయం

– కమిషనర్ సూర్య తేజ ఐ.ఏ.ఎస్.,

నెల్లూరు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయం సుందరీకరణ పనుల్లో భాగంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగం లాన్ లో ” వేస్ట్ టు ఆర్ట్” ఆలోచనలతో నూతనంగా నిర్మించిన సింహం ఆకృతిని కమిషనర్ సూర్య తేజ మంగళవారం ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా వ్యర్ధాలను తిరిగి వినియోగించేలా కళాకృతులను రూపొందించి, ప్రజల్లో చైతన్యం కల్పించడమే ధ్యేయంగా సుందరీకరణ పనులను చేపట్టామని తెలిపారు. “వ్యర్ధాలతో కళాకృతులు” అంశంతో వాడిపడేసిన రబ్బర్ ముక్కలతో సింహం ఆకృతిని సృజనాత్మకంగా రూపొందించారని కమిషనర్ ప్రశంసించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *