విధులను నిబద్ధతతో నిర్వహించండి
– కమిషనర్ వై.ఓ నందన్
నెల్లూరు నగర పాలక సంస్థలో వివిధ విభాగాలలో విధులను నిర్వహిస్తున్న సిబ్బంది నిబద్ధతతో తమ బాధ్యతలను నిర్వహించాలని కమిషనర్ వై.ఓ నందన్ ఆదేశించారు.
నెల్లూరు నగర పాలక సంస్థ కార్యాలయంలోని వివిధ విభాగాలను కమిషనర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ముందుగా పెన్షన్ విభాగాన్ని సందర్శించిన కమిషనర్ విభాగం ద్వారా ప్రజలకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వివిధ కేటగిరీలో పెన్షన్ లబ్ధిదారుల వివరాలను పరిశీలించారు.
హౌసింగ్ విభాగంలో సిబ్బంది దైనందిన విధుల నిర్వహణను అడిగి తెలుసుకున్నారు. టిడ్కో లబ్ధిదారులకు హౌసింగ్ విభాగం సిబ్బంది అందిస్తున్న సేవలను పరిశీలించారు.
అనంతరం వార్డు సచివాలయాలకు సంబంధించిన హెచ్ సెక్షన్ ను తనిఖీ చేశారు. సచివాలయాల కార్యదర్శుల ప్రతిరోజూ అటెండెన్స్, మంజూరు చేసిఉన్న సెలవులు తదితర వివరాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ సెక్రటరీ శ్రీలక్ష్మి పాల్గొన్నారు.