*విద్యుత్ లేనిదే ప్రపంచం లేదు…పొదుపుగా వాడుకోవాల్సిన బాధ్యత మనదే* *ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన ద్వారా సోలార్ రూప్ టాప్ ఏర్పాటు చేసుకోండి* *టీడీపీ కూటమి పాలనలో ఆక్వా రైతులకు మళ్లీ మంచి రోజులు…జోన్, నాన్ జోన్ నిబంధనలు లేకుండా రూ.1.50కే యూనిట్ విద్యుత్* *వైసీపీ ప్రభుత్వంలో జరిగిన దోపిడీలతో విద్యుత్ రంగంపై పెనుభారం* *పొదలకూరులో విద్యుత్ శాఖ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*

*విద్యుత్ లేనిదే ప్రపంచం లేదు…పొదుపుగా వాడుకోవాల్సిన బాధ్యత మనదే*

*ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన ద్వారా సోలార్ రూప్ టాప్ ఏర్పాటు చేసుకోండి*

*టీడీపీ కూటమి పాలనలో ఆక్వా రైతులకు మళ్లీ మంచి రోజులు…జోన్, నాన్ జోన్ నిబంధనలు లేకుండా రూ.1.50కే యూనిట్ విద్యుత్*

*వైసీపీ ప్రభుత్వంలో జరిగిన దోపిడీలతో విద్యుత్ రంగంపై పెనుభారం*

*పొదలకూరులో విద్యుత్ శాఖ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*

*విరువూరు, మహ్మదాపురం పంచాయతీలకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా మంజూరైన చెత్త తరలింపు ట్రాక్టర్ల అప్పగింత*

*సోమిరెడ్డి కామెంట్స్*

ప్రస్తుత రోజుల్లో బతకడానికి ఆహారం ఎంత అవసరమో కరెంటు కూడా అంతే

కరెంట్ లేకపోతే ప్రపంచం ముందుకు నడవని పరిస్థితి

గత ఐదేళ్లలో విద్యుత్ శాఖ మీద వివిధ రూపాల్లో భారీగా భారం పెంచేశారు

ట్రాన్స్ పార్మర్లు, స్మార్ట్ మీటర్లు, తీగలు, కండక్టర్లు తదితర అన్ని పరికరాల కొనుగోలులోనూ దోపిడీ

చేనేత మగ్గాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించడం శుభపరిణామం

2014-19 టీడీపీ ప్రభుత్వ హయాంలో జోన్, నాన్ జోన్ అనే తేడా లేకుండా ఆక్వా రంగానికి రూ.2కే యూనిట్ విద్యుత్ అందించారు

మీ బిడ్డ మీబిడ్డ అని చెప్పుకునే జగనన్న రూ.1.50కే యూనిట్ విద్యుత్ ఇస్తానని జోన్, నాన్ జోన్ పేరిట గందరగోళానికి తెరలేపారు

జోన్ పరిధిలోకి వైసీపీ నాయకులు, సానుభూతిపరులను మాత్రమే తెచ్చారు. నాన్ జోన్ పరిధిలో రూ.5కి పైగా భారం మోపారు

ఉదాహరణకు కృష్ణపట్నంలో ఉప్పు కాలువ, సముద్రం మధ్య ఆక్వా సాగు చేసే రైతులకు గత టీడీపీ ప్రబుత్వ హయాంలో యుద్దప్రాతిపదికన విద్యుత్ సౌకర్యం కల్పించాం

టీడీపీ ప్రభుత్వం మారగానే ఏడుగురు వైసీపీ సానుభూతి పరులను మాత్రమే జోన్ పరిధిలోకి తెచ్చారు..మిగిలిన రైతులందరిపై నాన్ జోన్ పేరుతో పెనుభారం మోపారు

ఇకపై ఆక్వా రైతులందరికీ జోన్, నాన్ జోన్, చిన్నరైతు, పెద్దరైతు అనే తేడా లేకుండా రూ.1.50కే విద్యుత్ ఇస్మని చంద్రబాబు నాయుడు ప్రకటించారు

పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ సోలార్ విద్యుత్ ను ప్రోత్సహించాలి..అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని సద్వినియోగం చేసుకుని సోలార్ యూనిట్లు పెట్టించుకోవాలి

నీటితో పాటు కరెంటును పొదుపుగా వాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed