*విద్యతోనే ఉజ్వల భవిత*
*టీడీపీ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో విద్యారంగంలో విశేష సంస్కరణలు*
*రేపటి నుంచి జూనియర్ కళాశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం*
సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*
*అవకాశాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు బంగారు భవిష్యత్తు పొందాలి*
*గిరిజన బిడ్డలు తప్పనిసరిగా బడికి వచ్చేలా ప్రతి ఒక్కరూ ప్రత్యేక దృష్టి పెట్టాలి*
*నాయుడు దశరథరామిరెడ్డి 26వ వర్థంతి సందర్భంగా నాయుడు నాగేశ్వరమ్మ వేదిక ట్రస్టు ద్వారా తోటపల్లి గూడూరు జెడ్పీ హైస్కూలులో విద్యార్థుకు ప్రోత్సాహక బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*
*సోమిరెడ్డికి ఘనస్వాగతం పలికిన చిన్నారులు, ఉపాధ్యాయులు, ఎన్డీఆర్ కుటుంబసభ్యులు*
*సోమిరెడ్డి కామెంట్స్*
గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం విద్యారంగాన్ని భ్రష్టు పట్టించింది
నాడు – నేడు పేరుతో కోట్లు ఖర్చుపెట్టినా స్కూళ్లలో నాడు లేదు..నేడు లేదు
తోటపల్లి గూడూరులోని సిద్ధవరపు నారాయణ రెడ్డి జెడ్పీ హైస్కూలుతో పాటు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పెండింగ్ లో ఉన్న భవనాల నిర్మాణాలను పూర్తిచేస్తాం
విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా అదనపు గదులు నిర్మిస్తాం
విద్యాలయాల అభివృద్ధికి నాయుడు కేశవులు రెడ్డి గతంలో సహకారం అందించారు…భవిష్యత్తులోనూ సాయం కొనసాగిస్తామనడం అభినందనీయం
రేపటి నుంచి మంత్రి నారా లోకేష్ బాబు సారధ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం కాబోతుంది
విద్యాశాఖలో ప్రభుత్వం అనేక మార్పులు తీసుకురాబోతోంది
గత ప్రభుత్వం చేసిన తప్పులన్నింటిని సరిదిద్ది విద్యారంగాన్ని గాడిలో పెట్టేందుకు లోకేస్ బాబు శ్రమిస్తున్నారు
డ్రాపవుట్స్ లేకుండా ప్రతి బిడ్డ స్కూలుకు వచ్చే విధంగా తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు చూడాలి
గిరిజన బిడ్డలు బడికి వచ్చేలా అందరూ శ్రద్ధ తీసుకోవాలని కోరుతున్నాను.