
*అమరావతి*
*రాష్ట్రంలో మొంథా తుఫానుప్రభావంపై ఉదయం నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు వరుస సమీక్షలు* సమయం 11pm*
ఉదయం నుంచి రాత్రి వరకూ విరామం లేకుండా పరిస్థితిని సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి
రెండు సార్లు ఆర్టీజీ సెంటర్ నుంచి సమీక్షలు, రెండుసార్లు టెలీకాన్ఫరెన్సులు నిర్వహించిన చంద్రబాబు.
మూడోసారి ఆర్టీజీ సెంటర్ నుంచి మొంథా తుఫానుపై చంద్రబాబు సమీక్ష.
ఆర్టీజీ సెంటర్ కు వచ్చిన సమాచారాన్ని విశ్లేషించి రియల్ టైంలో సమస్యల పరిష్కారానికి సీఎం చంద్రబాబు కృషి.
చెట్ల తొలగింపు, సబ్ స్టేషన్లల్లో సమస్యలను తక్షణం పరిష్కరించేలా సీఎం చంద్రబాబు కసరత్తు.
సీసీ కెమెరాల ద్వారా క్షేత్ర స్థాయిలో పరిస్థితిని పర్యవేక్షిస్తోన్న ముఖ్యమంత్రి.
సీఎం చంద్రబాబుతో పాటు ఆర్టీజీఎస్ కేంద్రంలో తుపాను ప్రభావంపై అధికారులకు సూచనలిస్తున్న మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, నారాయణ.
ఆర్టీజీ సెంటర్ నుంచి వర్షప్రభావిత జిల్లాల్లో మంత్రులు, అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఆదేశాలు జారీ చేస్తున్న సీఎం.
ఎంత చిన్న పల్లెటూరైనా, లంక గ్రామామైనా తుఫాను సహయక చర్యలు అందేలా సీఎం ఆదేశాలు.
మరోవైపు పునరావాస శిబిరాల్లో పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్న ముఖ్యమంత్రి.
జిల్లాలకు వెళ్లిన మంత్రులు, ప్రత్యేకాధికారులతో ఆర్టీజీ సెంటర్ నుంచి నిరంతరం చర్చిస్తోన్న సీఎం.
రాష్ట్రంలోని తుఫాను పరిస్థితిపై సీఎం చంద్రబాబుకు ఫోన్ చేసిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్.
రాష్ట్రంలోని తుఫాను పరిస్థితిని ముఖ్యమంత్రిని వివరాలు అడిగి తెలుసుకున్న కేంద్ర మంత్రి.