
*రంగనాయకులపేటలోని పినాకిని పార్కును సందర్శించిన నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ వై ఓ నందన్*
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ స్థానిక రంగనాయకులపేట పినాకిని పార్క్ ను శుక్రవారం సందర్శించారు.
పార్క్ కు పోయే మార్గంలో ఉన్న ఆక్రమణలను పూర్తిస్తాయిలో తొలగించి అభివృద్ధి పనులను చేపట్టాలని టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులను కమిషనర్ ఆదేశించారు.
పార్క్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించిన కమిషనర్, పనులను వేగవంతంగా పూర్తి చేసి పార్కును త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సిబ్బందిని ఆదేశించారు