*బెట్టింగ్ మాఫియాని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు : వైసిపి యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఊటుకూరు నాగార్జున*
——————————————-
*బెట్టింగ్ మాఫియా పై చర్యలు తీసుకోవాలని కోరుతూ* .. నెల్లూరు నగర డి.ఎస్.పి కార్యాలయంలో వైసిపి యువజన విభాగం జిల్లా అధ్యక్షులు, కార్పొరేటర్ *ఊటుకూరు నాగార్జున* గారు, వైసిపి జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు *ఆశ్రిత్ రెడ్డి* గారు..నగర డి.ఎస్.పి సింధు ప్రియా గారికి వినతి పత్రం అందజేశారు..
*బెట్టింగ్ మాఫియా బారిన పడి ఎంతోమంది యువత పెడద్రోవ పడుతున్నారని.. డిఎస్పి గారికి వారు వివరించారు.*
ఈ సందర్భంగా ఊటుకూరు నాగార్జున గారు, ఆశ్రిత్ రెడ్డి గారు మాట్లాడుతూ..
👉 *నెల్లూరులో రోజురోజుకు బెట్టింగ్ మాఫియా.. జోరుగా విస్తరిస్తుందన్నారు.*
👉 *ఎంతోమంది యువత ఈ బెట్టింగ్ మాఫియా.. వలలో చిక్కుకొని.. వారి జీవితాలను చిన్నబిన్నం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.*
👉 *ఈ బెట్టింగ్ మాఫియా పై.. పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి.. బెట్టింగ్ ను ప్రోత్సహిస్తున్న వారిపై.. కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.*
👉 *బెట్టింగ్ మాఫియా ఆగడాలను అరికట్టే విధంగా.. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు.*
👉 *మా నాయకులు పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు.. బెట్టింగ్ మాఫియా..ను అరికట్టేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పూర్తి స్థాయి లో సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.*
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.