
**బిజెపి ఓబీసీ రాష్ట్ర నేత ముక్కు రాధాకృష్ణ గౌడ్ కు ఘన సన్మానం**
భారతీయ జనతా పార్టీ ఓబిసి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియామకం చేపట్టిన ముక్కు. రాధాకృష్ణ గౌడ్ కు పుష్పగుచ్చాలు, షాల్వాలు స్వీట్లు అందించి ఘనంగా సన్మనించడం జరిగింది.
నెల్లూరు నగరంలో ఆదిత్య నగర్లోని ఆయన నివాసంలో జరిగిన పై కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గతంలో తాను విద్యార్థి నాయకుడిగా ఏబీవీపీలో నిత్యం విద్యార్థి సమస్యలు పరిష్కారం కోసం ఎన్నో ఉద్యమాలు చేశానని ఎన్నోసార్లు పోలీసులాటి దెబ్బలు తిన్నానని జైలు జీవితం గడపాలని విద్యార్థి లోకం కోసం 16 సంవత్సరాలు అలుపెరుగని పోరాటాలు చేశానని వందలాది విద్యార్థులను సొంత ఖర్చులతో చదివించానని వేలాదిమంది విద్యార్థి యువతకు తన వంతు సహాయ సహకారాలు అందించి ఉన్నతంగా తీర్చిదిద్దానని వారంతా వివిధ రంగాలలో విజయ పరంపర కొనసాగిస్తూ ఉన్నత స్థితికి చేరుకోవడం సంతోషం ఇచ్చిందన్నారు.
ఆస్ఫూర్తితోనే తనపై చూపిస్తున్న ప్రేమ అభిమానాలతో రెట్టింపు ఉత్సాహంతో గత 23 సంవత్సరాలుగా బిజెపిలో చేరి అనేక బాధ్యతలు నిర్వహిస్తూ అన్ని వర్గాల ప్రజలకు సేవ చేస్తున్నానని బిజెపిలో సాధారణ కార్యకర్తలను కూడా జిల్లాస్థాయి రాష్ట్రస్థాయి నేతలుగా తీర్చిదిద్దానని గురువును మించిన శిష్యులుగా వారందరూ తయారయ్యారని ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థి యువతకు, సమాజంలో ప్రతి ఒక్కరికి దేశభక్తి, జాతీయ భావాలు, నైతిక విలువలు నేర్పే దిశలో పని చేస్తున్నా అన్నారు. అలాగే అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి సాధించే దిశగా పనిచేస్తానని బిజెపి పట్ల అభిమానంగా సానుకూలంగా ఉన్న వారందరినీ పార్టీలోకి ఆహ్వానించి సముచిత స్థానం కల్పిస్తానన్నారు, తద్వారా వారందరికీ సమాజసేవ చేసే భాగ్యాన్ని అందిస్తామన్నారు.
పై కార్యక్రమంలో ఏబీవీపీ నెల్లూరు విభాగ్ ప్రముఖ పరదేశి. గంగాధర్ పూర్వ ఏబీవీపీ విద్యార్థి నాయకులు పోలిచర్ల.ఉదయ్ కుమార్, ఎస్.కె నాయబ్ రసూల్ అంజయ్య, కాయల.మధు, పైడి. చరణ్ తేజ, చిన్న, భానుకిరణ్, ఏ. వెంకటేశ్వర రెడ్డి, తదితరులు పాల్గొన్నారు