*పోతిరెడ్డి పాళెం రోడ్డు ప్రమాదంలో మృతుడి కుటుంబానికి ఆర్ధిక సహాయం అందించి మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి*

కోవూరు మండలం పోతిరెడ్డి పాళెం గ్రామంలో ఇంట్లోకి కారు దూసుకెళ్లిన సంఘటనలో మృతి చెందిన రమణయ్య కుటుంబాన్ని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
గారు పరామర్శించారు.

మృతుడు రమణయ్య భౌధిక కాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కారు ప్రమాదంలో మృతవాత పడ్డ రమణయ్య కుటుంబానికి 1 లక్ష రూపాయల ఆర్ధిక సంహాయం అందించి మానవత్వం చాటుకున్నారు.

ఈ కార్యక్రమంలో జొన్నవాడ ఆలయ సేవా కమిటి ఛైర్మెన్ తిరుమూరు అశోక్ రెడ్డి, పెన్నా డెల్టా ఛైర్మెన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి, స్థానిక ఎంపీటీసీ నాగరాజు, టిడిపి నాయకులు ఇంత మల్లారెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, గాదిరాజు అశోక్, అడపాల శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed