పరిపాలన సౌలభ్యం కోసం సూపరింటెండెంట్ ల బదిలీలు

– కమిషనర్ సూర్య తేజ

నెల్లూరు నగర పాలక సంస్థ పరిపాలన సౌలభ్యం కోసం, వివిధ విభాగాల పనితీరును క్రమబద్ధీకరించడానికి పలువురు సూపరింటెండెంట్ లను బదిలీలను చేపట్టినట్టు కమిషనర్ సూర్య తేజ బుధవారం ఉత్తర్వులను జారీ చేశారు. వి. పద్మావతి సూపరింటెండెంట్ ను ఇంజనీరింగ్ సెక్షన్ నుంచి ఎలక్షన్ విభాగానికి,
ఎ.వి. సులోచన సూపరింటెండెంట్ ను పబ్లిక్ హెల్త్ విభాగం/ ఇంచార్జ్ సూపరింటెండెంట్ మెప్మా నుంచి రెవెన్యూ విభాగానికి, కె. పద్మ సూపరింటెండెంట్ ను టౌన్ ప్లానింగ్ విభాగం నుంచి హౌసింగ్ విభాగానికి,
మునిరత్నం సీనియర్ అసిస్టెంట్ ను G.S.W.S విభాగం నుంచి ఇంచార్జ్ సూపరింటెండెంట్ టౌన్ ప్లానింగ్ విభాగానికి, పి. శ్రీనివాసులు సూపరింటెండెంట్ ను రెవెన్యూ విభాగం నుంచి పబ్లిక్ హెల్త్ విభాగానికి/ఇంచార్జ్ సూపరింటెండెంట్ గా మెప్మా విభాగానికి,

బి. విజయ సీనియర్ అసిస్టెంట్ ను ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ విభాగం నుంచి ఇంచార్జ్ సూపరింటెండెంట్ GSWS విభాగానికి,

ఎన్. నరేంద్ర సూపరింటెండెంట్ ను కమాండ్ కంట్రోల్ విభాగం నుంచి ఇంజనీరింగ్ విభాగానికి,

జి. బాల సుబ్రహ్మణ్యం సీనియర్ అసిస్టెంట్ ను హౌసింగ్ విభాగం నుంచి మెప్మా విభాగం సీనియర్ అసిస్టెంట్ గా బదిలీలు చేస్తూ కమిషనర్ ఉత్తర్వులను జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed