
*నగర సుందరీకరణ పనులలో భాగంగా జరుగుతున్న కార్యక్రమాలను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించిన కమిషనర్ వై ఓ నందన్*
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ నగర పర్యటనలో భాగంగా సోమవారం స్థానిక ముత్తుకూరు రోడ్డు జంక్షన్ లో నూతనంగా నిర్మిస్తున్న యోగ ఆకృతులు, ఫౌంటైన్ నిర్మాణాలను ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి పరిశీలించారు.
నగర సుందరీకరణ పనులలో భాగంగా జరుగుతున్న కార్యక్రమాలను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కమిషనర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.
పి.ఆర్.ఓ
నెల్లూరు నగరపాలక సంస్థ