*డిప్యూటీ మేయర్ ఎన్నికలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దే నైతిక విజయం..*

*… విప్ ఉల్లంఘించిన వారందరిపై వేటు ఖాయం*

*. స్వతంత్ర అభ్యర్థి అంటూ వైసిపి కార్పొరేటర్ల చేత ఓటు వేయించుకున్నారు*

– *విప్ భయంతోనే టీడీపీ డ్రామాలు*

*ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.*
—————————————-

నెల్లూరు నగర్ కార్పొరేషన్ కార్యాలయంలో *వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర, రూరల్ కార్పొరేటర్ల* తో కలిసి.. డిప్యూటీ మేయర్ ఎన్నికలో .. ఎమ్మెల్సీ *పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* పాల్గొన్న… అనంతరం మీడియాతో మాట్లాడారు.

👉 *డిప్యూటీ మేయర్ ఎన్నికలో టిడిపి గెలిచినప్పటికీ నైతికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందన్నారు.*

👉 *వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. డిప్యూటీ మేయర్ క్యాండిడేట్ గా కార్పొరేటర్ కరిముల్లా గారిని నిలిపి వైసిపి బీఫామ్ ఇస్తే.. టిడిపి కనీసం బీఫామ్ కూడా..ఇవ్వలేని దుస్థితిలో.. అభ్యర్థిని పోటీకి నిలిపిందని ఎద్దేవా చేశారు.*

👉 *ఇండిపెండెంట్ గా క్యాండిడేట్ ను పెట్టుకొని.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన కార్పొరేటర్ల చేత.. తెలుగుదేశం పార్టీ ఓట్లు వేయించుకోవడం దుర్మార్గమన్నారు.*

👉 *వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసిందన్న భయంతోనే.. తెలుగుదేశం పార్టీ ఇండిపెండెంట్ గా పోటీకి దిగిందన్నారు.*

👉 *అయినప్పటికీ..వైసిపి బీఫామ్ తో పోటీ చేసిన అభ్యర్థికి.. ఓట్లు వేయని .. వారందరూ విప్ ఉల్లంఘించినట్లేనని ..వారు అనర్హత వేటు నుంచి తప్పించుకోలేరని అన్నారు.*

👉 *తెలుగుదేశం పార్టీ కార్పొరేషన్ ఎన్నికల్లో.. గెలవలేక.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన… కార్పొరేటర్లను ప్రతి సారి కొనుగోలు చేసి.. కార్పొరేషన్ తమదే అన్నట్టుగా.. బిల్డప్ ఇచ్చుకుంటుందన్నారు*

👉 *ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని.. ఈరోజు ఓటమి రేపటి గెలుపుకు నాంది పలుకుతుందన్నారు.*

👉 *వాస్తవంగా.. తాము ఓడిపోయినప్పటికీ.. నైతికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని పేర్కొన్నారు .*

👉 *విప్ ఉల్లంఘించిన కార్పొరేటర్ల పై .. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.. కచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోబోతుందని తెలిపారు.*

👉 *రాబోయే రోజుల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి.. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు.. అమలు దిశగా ప్రజలతో కలిసి పోరాటాలు సాగిస్తుందన్నారు.*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed