చెత్త సేకరణ వాహన డ్రైవర్లు క్రమశిక్షణ పాటించండి

– కమిషనర్ సూర్య తేజ

నెల్లూరు నగరపాలక సంస్థలో విధులు నిర్వహిస్తున్న చెత్త సేకరణ వాహనాల డ్రైవర్లు క్రమశిక్షణ పాటించి, నిర్దేశించిన సమయానికి తమకు కేటాయించిన డివిజన్లలో విధులకు హాజరుకావాలని కమిషనర్ సూర్య తేజ ఆదేశించారు. పారిశుధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా కమిషనర్ గురువారం స్థానిక టి.బి. ఆసుపత్రి వెహికల్ షెడ్డును తనిఖీ చేశారు. డ్రైవర్లంతా నిర్దేశించిన సమయానికి వాహన షెడ్డుకు చేరుకుని హాజరువేయాలని సూచించారు. సమయానికి హాజరైన వారందరూ కలిసి బృందంగా ఫోటో తీసి క్రమం తప్పకుండా ప్రతిరోజు తనకు పంపించాలని కమిషనర్ ఆదేశించారు.

ఉదయం 6 గంటల నుంచి తమకు కేటాయించిన డివిజన్లలో చెత్త సేకరణ విధులకు డ్రైవర్లంతా హాజరు కావాలన్నారు. వాహనాలకు డీజిల్ నింపుకోవడంలో జాప్యం లేకుండా ముందురోజునే నింపుకోవాలని కమిషనర్ డ్రైవర్లకు సూచించారు. విధులలో అలసత్వం వహించకుండా నిబద్దతతో పని చేయాలని కమిషనర్ వారికి సూచించారు.

ఈ కార్యక్రమంలో వెహికల్ ఇంచార్జ్ రఘురాం, శానిటేషన్ సూపర్వైజర్ నరసింహారావు, వార్డు సచివాలయ శానిటేషన్ కార్యదర్శులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed