*ఖాళీ అవుతున్న వైసిపి*

*వైయస్సార్ పార్టీకి మరో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా?*

*జన హుషార్ న్యూస్ ప్రతినిధి*

అమరావతి :మార్చి 19
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ఈరోజు రాజీనామా చేశారు.

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు నలుగురు ఎమ్మెల్సీలు వైసీపీకి రాజీనామా చేశా రు. వీరిలో పోతుల సునీత, బల్లి కల్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, జయమంగళ వెంకటరమణలు ఉన్నారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి మర్రి రాజశేఖర్ ఆ పార్టీలో కొన సాగుతున్నారు. 2014లో రాజశేఖర్ కు చిలకలూరి పేట టికెట్ ఇవ్వగా టీడీపీ నేత పత్తిపాటి పుల్లారావుపై ఓట మిపాలయ్యారు. 2019 ఎన్నికల్లో ఆయన స్థానంలో చిలకలూరిపేట నియోజక వర్గం నుంచి విడుదల రజని వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు.

అయితే, ఆ సమయంలో టికెట్ ఇవ్వనికారణంగా అసంతృప్తిగా ఉన్న రాజ శేఖర్ కు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు. చెప్పినట్టుగానే ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు.

ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీలో మర్రి రాజశేఖర్ కీలక నేతగా ఉన్నారు. అయితే, రాజశేఖర్ పార్టీని వీడి వెళ్తారని కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. ప్రచారం జరుగుతున్నట్లు గానే ఆయన తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అయితే, ఆయన టీడీపీలో చేరుతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *