*కూటమి ప్రభుత్వ పరిపాలన మరో ఎమర్జెన్సీ సూచిస్తుందని మండిపడ్డ* .. *ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.*

—————————————
నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో *ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు.

*చంద్రశేఖర్ రెడ్డి* గారి కామెంట్స్..

👉 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వరుస కుంభకోణాలకు పాల్పడుతుందన్నారు.

👉 కూటమి ప్రభుత్వం చేస్తున్న వరుస కుంభకోణాలను ఇతర పత్రికలతో పాటు సాక్షి పత్రిక కూడా.. ప్రచురించడంతో.. సాక్షి పత్రిక పై కక్ష కట్టారన్నారు.

👉 అందులో భాగంగానే ఈరోజు సాక్షి పత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డి గారిని నిర్బంధించి ఆయన ఇంట్లో పోలీసులు సోదాలు చేయడం దుర్మార్గమైన విషయం అన్నారు.

👉 పత్రికల్లో వార్తలు రాస్తే.. ఆ పత్రికల ఎడిటర్లను ఇలా.. దారుణంగా నిర్బంధించడం సరికాదన్నారు.

👉 ఇది ముమ్మాటికీ రాజకీయ కక్షగా అభివర్ణించారు.

👉 ఇలాంటి దారుణాలు చోటు చేసుకున్నప్పుడు ఈ సమాజం అసలు ఎక్కడికి పోతుందా అన్న ప్రశ్న తలెత్తుతుందన్నారు.

👉 సమాజంలో జరుగుతున్న అవినీతిని, దోపిడీలను పత్రికలు ఖండించకుండా ఇంకెవరు ఖండిస్తారో చెప్పాలని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

👉 కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు.. ఎమర్జెన్సీ రోజులను తలపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

👉 ఎమర్జెన్సీ రోజుల్లో ప్రతిపక్ష నాయకుల్ని నిర్బంధించి.. వారిని ఎలా హింసించారో మనందరికీ తెలిసిన విషయమేనన్నారు.

👉 ఈరోజు అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ కూడా.. ప్రతిపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలు, వారి మద్దతుదారుకు సంబంధించిన ఇళ్ళ లో సోదాలు జరిపి.. ఎవరో ఒకరి చేత అబద్ధపు వాంగ్మూలం ఇప్పించి.. అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించడం మనందరం ఈరోజు చూస్తున్నామన్నారు.

👉 ఈరోజు అధికార పార్టీకి వత్తాసు పాడుతూ పోలీసులు కూడా అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

👉 ఇలాంటి దుర్మార్గాలను చూస్తూ ప్రజలు కూడా ఈ రోజు సిగ్గుపడాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయని అన్నారు.

👉 మరో పక్క దేశంలో పెహల్గాం లాంటి ఘటనలతో అమాయకులైన భారతీయుల ప్రాణాలను.. ఉగ్రవాదులు.. కబలిస్తూ దుర్మార్గానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

👉 ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాద చర్యలకు దీటుగా ఆపరేషన్ సింధూర్ పేరుతో.. ముష్కర్ మూకలను అంతమందించడంతో.. యావత్ భారతావని పండుగ చేసుకుంటుందన్నారు.

👉 అయితే రాష్ట్రంలో మాత్రం.. దుర్మార్గమైన పాలన సాగుతుందని ఇది ఎప్పుడు అంతమవుతుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు.

👉 ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న అన్ని కుంభకోణాలు..మరెక్కడా చోటు చేసుకోవడం లేదన్నారు.

👉 గత వైసీపీ ప్రభుత్వంలో 2.49 పైసలకు విద్యుత్ కొనుగోలు చేస్తే.. టిడిపి నేతలు గగ్గోలు పెట్టారని.. మేము అధికారంలోకి వస్తే 1.99 పైసలకే విద్యుత్ కొనుగోలు చేస్తామని చెప్పి.. ఈనెల రెండవ తేదీ యాక్సిస్ పవర్ కంపెనీతో ఒప్పందం పెట్టుకుని.. 4.60 పైసలకి యూనిట్ విద్యుత్తును కొనుగోలు చేయడాన్ని ప్రజలు చూస్తూ ముక్కును వేలేసుకుంటున్నారని అన్నారు.

👉 ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పందం 11 వేల కోట్ల స్కాం అన్నారు.

👉 విద్యుత్ ఛార్జీలు పెంచనే పెంచమని చెప్పి అధికారంలోకి వచ్చిన టిడిపి ప్రభుత్వం నేడు.. సర్ చార్జీల పేరుతో ప్రజలపై 15 వేల కోట్ల భారం మోపిందని.. మండిపడ్డారు.

👉 టిడిపి ప్రభుత్వం చేస్తున్న.. మోసాలను ప్రజలు ఒక్కొక్కటిగా తెలుసుకుంటున్నారన్నారు.

👉 కూటమి ప్రభుత్వంలో ఈ మధ్యకాలంలో అతిపెద్ద కుంభకోణం ఉర్స కుంభకోణం.. ఇందులో 3 వేల కోట్ల అవినీతి జరిగిందన్నారు

👉 అలాగే అమరావతి రాజధాని టెండర్లలో కుంభకోణం, ఇసుక, క్వార్జ్, లిక్కర్.. కుంభకోణాలతో కూటమి ప్రభుత్వం ఒక మాఫియాగా చెలరేగిపోతుందని ధ్వజమెత్తారు.

👉 ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రజలకు.. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో.. పూర్తిగా ప్రజా వ్యతిరేకతకు గురైందన్నారు..

👉 ఫీజు రీయింబర్స్మెంట్.. 6 ఇన్స్టాల్మెంట్లు పెండింగ్,అలాగే.. విద్యార్థులకు వసతి దీవెన ఇంతవరకు చెల్లించలేదన్నారు. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం, ఉచిత బస్సు ప్రయాణం, అన్నదాత సుఖీభవ,.. పథకాలన్ని ఏమయ్యాయో కూటమినేతల సమాధానం చెప్పాలన్నారు.

👉 ఈరోజు రైతులకు గిట్టుబాటు ధర లేక.. ఆందోళన చెందుతున్న పరిస్థితులు తలెత్తుతున్నాయని.. గత వైసిపి ప్రభుత్వం లో పుట్టి 20 నుంచి 25 వేలు రూపాయలకు అమ్ముకున్న రైతులు నేడు.. 16 నుంచి 17వేల రూపాయలకు అమ్ముకోవాల్సిన దుస్థితి తలెత్తిందన్నారు.

👉 విద్య, వైద్య, వ్యవసాయ రంగాలు.. పూర్తిగా అధోగతిపాలయ్యాయని.. మరోపక్క వ్యాపారులు.. వ్యాపారాలు లేక.. విలవిలలాడుతున్నారని అన్నారు.

👉 రాజకీయ నాయకుల పై కేసులు పెట్టడం వారిని జైలుకు పంపించడం.. సర్వసాధారణంగా జరుగుతున్న విషయమైనప్పటికీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కూడా నిర్బంధించి.. వారిపై తప్పుడు కేసులు బనాయించి వారిని జైల్లో పెట్టడం దుర్మార్గం అన్నారు.

👉 ఐపీఎస్ సీతారామాంజనేయులు విషయంలో ఇది స్పష్టంగా కనిపిస్తుందని.. ఒక డీజీ ర్యాంకు కలిగిన అధికారిని ఈ విధంగా .. ఎవరో చెప్పిన అబద్ధపు స్టేట్మెంట్ ఆధారంగా.. ఆయన్ను అరెస్ట్ చేసి కేసులు పెట్టి జైల్లో వేయడం దుర్మార్గమన్నారు.

👉 ఇలా ఈ కేసులకు ఎవరైతే సహకరిస్తున్నారు.. రేపటి రోజున .. ఈ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పరిస్థితి ఏంటో.. ఆలోచించుకోవాలన్నారు

👉 ఈ విధంగా కేసులు పెట్టే సంస్కృతి అసలు ఇప్పుడైనా ఎక్కడైనా చూసామా.. కేవలం కూటమి ప్రభుత్వంలో మాత్రమే ఇలాంటి అన్యాయాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

👉 ఈరోజు లిక్కర్ అయితే విపరీతంగా ఏరులై పారుతుందని.. బెల్టు షాపులు పర్మిట్ రూములు, సమయం సందర్భం లేకుండా ఇష్టా రీతిలో.. మద్యం తాగిస్తూ.. టిడిపి ప్రభుత్వం దారుణాలకు తెగబడుతుందన్నారు.

👉 గత వైసిపి ప్రభుత్వం లో.. లిక్కర్ .. ప్రతి బాటిల్ ను స్కాన్ చేసి..ఎంతో పారదర్శకంగా, జవాబుదారితనంగా లిక్కర్ అమ్మి.. అమ్మిన ప్రతి రూపాయిని.. చలానా కట్టి బ్యాంకుకు జమ చేయడం జరిగిందన్నారు.

👉 ప్రతిమద్యం షాపులో 8 మందిని ఎంప్లాయిస్ ని ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించడం జరిగిందన్నారు.

👉 ఎంపీ మిధున్ రెడ్డి పై కూడా అక్రమ కేసు బనాయించి.. ఆయనకు ఈరోజు బెయిల్ రాకుండా చేశారని మండిపడ్డారు.

👉 గత ప్రభుత్వంలో ఎంతో హుందా.. పరిపాలన అందించేందుకు జగన్ మోహన్ రెడ్డి గారికి సహాయపడిన ధనుంజయ రెడ్డి గారిని, కృష్ణమోహన్ రెడ్డి గారి లాంటి సివిల్ సర్వీసెస్ అధికారులను లిక్కర్ కేసులో అరెస్ట్ చేయడం దారుణం అన్నారు.

👉 ఇలా కూటమి ప్రభుత్వం దారుణాలకు పాల్పడుతూ మీడియా గొంతులు నోక్కే ప్రయత్నం చేస్తుందని.. చంద్రశేఖర్ రెడ్డి గారి మండిపడ్డారు.

👉 ఇలాంటి దారుణాలు రాబోయే రోజుల్లో కూడా చోటు చేసుకుంటే భవిష్యత్తులో ప్రజలే రోడ్డుపైకి వచ్చి.. ఎదురు తిరిగి పోరాడే పరిస్థితి వస్తుందని.. కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *