ఢిల్లీః
19-5-2024
ఆదివారం.
(జన హుషార్)
ఢిల్లీలో చింతా మోహన్, కేంద్ర మాజీ మంత్రి & కాంగ్రెస్ సీనియర్ నేత ప్రెస్ కాన్ఫరెన్స్
• ఏపిలో చంద్రబాబు అధికారంలోకి రాబోతున్నారు.
• ఏపిలో జగన్, మోడి వ్యతిరేక పవనాలు చాలా స్పష్టంగా కనిపించాయి.
• జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు అనుకూల పవనాలు కనిపించాయి.
• చంద్రాబాబు బిజెపితో పెట్టుకుని పొరపాటు చేశారు.
• బిజెపితో పొత్తు ఉండడం మూలంగా చంద్రబాబుకు స్థానాలు తగ్గుతాయి.
• లోకపోతే చంద్రబాబు కు 150 స్థానాలకు పైగా వచ్చేవి.
• ఖచ్చితంగా జగన్ ఓడిపోవడం ఖాయం.
• జగన్ ను పెంచిపోషిస్తున్న మహా ఘనుడు మోడి పతనం కూడా ప్రారంభమైంది.
• దేశవ్యాప్తంగా బిజేపికి150 స్థానాలకు మించి రావు.
• కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం.
• మోడి, జగన్ లు ఇంటికి పోవడం ఖాయం.
• జగన్ వ్యతిరేక ఓటు చంద్రబాబుకు లాభించింది.
• జగన్ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ సొంతం చేసుకోలేక పోయింది. చంద్రబాబుకు పడ్డాయి.
• అయుతే, కాంగ్రెస్ పార్టీ 2029 లో ఏపిలో అధికారంలోకి వస్తుంది.
• రత్నాలు ఏమీ జగన్ కు పనిచేయలేదు. డబ్బులే పనిచేశాయి.
• ఒక్కసారి ఛాన్స్ ఇవ్వమంటే, జగన్ కు ప్రజలు అవకాశం ఇచ్చారు. ఐపోయింది.
• అయ్యో…జగన్ ఓడిపోతున్నాడు అనే బాధ ప్రజల్లో లేదు.
• మనది మంచి ప్రజాస్వామ్య దేశం.
• మన ప్రజాస్వామ్య దేశంలో అద్భుతాలు జరుగుతున్నాయి.
• అధికారం కోసం జగన్మోహన్ రెడ్డి అద్భుతాలు చేశారు.
• జరిగిన ఎన్నికల్లో ఒక చిన్న రాష్ట్రంలో, ఏపిలో ఒక చిన్న ప్రాంతీయ పార్టీ 4 నుంచి 5 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది.
• జాతీయ పార్టీ అయున కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అంత పెద్దమొత్తంలో 5 శాతం కూడా ఖర్చు చేయలేక పోయింది.
• ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఎన్నికల్లో పంపిణీ కోసం జగన్మోహన్ రెడ్డి ఎలా తెచ్చారు!?
• ఇందుకోసం, జగన్మోహన్ రెడ్డికి పద్మశ్రీ, పద్మ విభూషణ్ పురస్కారం ఇవ్వాలి .
• ఇది ఎలా సాధ్యమైందో సంబంధిత సంస్థలే చెప్పాలి.
• తిరుపతి లోకసభ నియోజకవర్గం పరిధిలో ఒక అసెంబ్లీ స్థానంలో అధికార వై.ఎస్.ఆర్.సి.పి అభ్యర్ధి సుమారు 80 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.
• ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చింది….!?
• తిరుపతి లోకసభ నియోజకవర్గం పరిధిలో ఎస్.సి అసెంబ్లీ స్థానం గూడూరు లో అధికార పార్టీ అభ్యర్ధి 45 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.
• ఈ డబ్బును ఓ హోటల్లో పెట్టి పోలీసు అధికారి పంపిణీ చేశారు.
• తిరుపతి లోకసభ నియోజకవర్గం పరిధిలోనే 200 నుంచి 300 కోట్ల రూపాయలు, అధికార వైసిపి ఖర్చు చేసింది.
• అన్నీ తెలిసి కూడా, వ్యవస్థలన్నీ విఫలమైపోతున్నాయి.
• ఎన్నికల సంఘం పూర్తిగా బలహీన పడిపోతోంది.
• దొంగలను పట్టుకోవాల్సిన పోలీసులే, దొంగతనాలు చేస్తుంటే, పోలీసు వ్యవస్థ గురించి చెప్పాల్సిన అవసరం ఏముంది…!?
• పోలీసులు మమ్మల్ని సాక్ష్యాలు అడిగారు. ఎవరిస్తారు?
• అధికారంలోకి వచ్చేందుకు
వైసిపి ఇలా అవినీతి, అక్రమాలు
చేసింది.