*ఆపరేషన్ సింధూర్: మసూద్ కుటుంబం హతం*
ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత ఆర్మీ జరిపిన దాడుల్లో జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ ఇల్లు నేలమట్టమైంది.
పాకిస్థాన్ బహావల్పూర్లోని మసూద్ ఇంటితో పాటు అతడి ట్రైనింగ్ క్యాంప్పై మిస్సైల్ దాడి జరిగింది.
ఈ ఘటనలో మసూద్ కుటుంబసభ్యులు 10 మంది మృతిచెందారని పాక్ మీడియా చెబుతోంది.
అయితే మృతుల్లో మసూద్ ఉన్నాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
అతడు మరణిస్తే ఉగ్ర సంస్థకు చావు దెబ్బే.
#ఆపరేషన్ సిండోర్