*”అక్రమ కేసులకు భయపడం” – కాకాణి*
*SPS నెల్లూరు జిల్లా:*
*తేది:24-03-2025*
*నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైసీపీ నేతలపై అక్రమ కేసులకు నిరసనగా నెల్లూరు రూరల్ ఇంచార్జి ఆనం విజయ కుమార్ రెడ్డిగారు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పోలీస్ మైదానంలో నిర్వహించిన గ్రీవెన్స్ లో అడిషనల్ యస్.పి. సౌజన్య గారికి వినతి పత్రం అందించిన మాజీ మంత్రి మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా౹౹ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు*.
*కాకాణి కామెంట్స్:*
👉పోలీసులను ఉపయోగించుకొని అధికార పార్టీ నాయకులు వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారు.
👉వైకాపా కార్పొరేటర్ శ్రీనివాస్ యాదవ్ స్పస్టమైన ఆధారాలు లేకుండా అక్రమ కేసు నమోదు చేశారు.
👉 వైకాపా నాయకులను అక్రమ కేసులతో భయపెట్టాలని అధికార పార్టీ యోచిస్తుంది.
👉వైకాపా మహిళా విభాగం నేత రమాదేవి ఇంటికి మీదకు వెళ్లి టీడీపీ నేతలు దాడి చేస్తే, ఇంత వరకు కేసు నమోదు చేయలేదు.
👉దాడికి సంబధించిన వీడియోలు బయటపెట్టినా.. పోలీసులు కేసు నమోదు చెయ్యలేదు.
👉 జిల్లాలో శాంతి భద్రతలను కాపాడటంలో పోలీసులు విఫలం చెందుతున్నారు.
👉 పోలీస్ యంత్రాంగం అధికార పార్టీ నేతలు చెప్పిన విధంగా పనిచేయడం దురదృష్టకరం.
👉 అధికార పార్టీ పెడుతున్న కేసులకు భయపడి, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు.
👉అధికార పార్టీ అరాచకాలను ఎదుర్కొంటాం, వైసీపీ కార్యకర్తలకు అండగా నిలుస్తాం.. జిల్లాలో క్యాడర్ ని కాపాడుకుంటాం.