*భారత పరాక్రమాలకు ఆపరేషన్ సింధూర్ చర్య నిదర్శనం : నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి*
‘ఆపరేషన్ సింధూర్’ లో భాగంగా భారీ సంఖ్యలో ఉగ్రవాదులను మట్టుబెట్టిన భారత్ ఆర్మీ పై నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశంసలు కురిపించారు.
భారత సైన్యం పరాక్రమాలు ఏంటో పాకిస్తాన్ కు చూపించారన్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి ఇది భారత్ తక్షణ, ధీటైన ప్రతీకారంగా అభివర్ణించారు. ఈ విజయవంతమైన ఆపరేషన్ దేశం మొత్తానికి గర్వకారణమని, . భారత్ జోలికి వస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో పాకిస్తాన్కు ఈ దాడి స్పష్టంగా తెలియజేసిందన్నారు.
ఈ శక్తివంతమైన నిర్ణయానికి నాయకత్వం వహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి కృతఙ్ఞతలు తెలిపారు. దేశ భద్రత కోసం నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, శత్రువుకు భయంకర ప్రతిస్పందన ఇస్తున్న భారత సాయుధ దళాలకు ధన్యవాదాలు తెలిపారు.
ఉగ్రవాదంపై భారత్ పోరు కొనసాగుతుందని ఆయన ఉద్ఘాటించారు.