*బహిరంగ ప్రదేశాలలో కుళ్ళిపోయిన కూరగాయలను వేయడం, పరిసరాలను అపరిశుభ్రం చేయటం నేరమని వారిని మందలించారు. మరోసారి పరిసరాలను అపరిశుభ్రం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వారిని హెచ్చరించిన కమిషనర్*

 

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ పారిశుద్ధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక అపోలో సెంటర్ ప్రాంతంలో మంగళవారం పర్యటించారు.

ఈ సందర్భంగా కూడలిలో టమేటా, కూరగాయలు అమ్ముతున్న నిర్వాహకులు పరిసరాలను అత్యంత అపరిశుభ్రంగా ఉంచటాన్ని గమనించిన కమిషనర్ నిర్వాహకులను పిలిచి మాట్లాడారు.

బహిరంగ ప్రదేశాలలో కుళ్ళిపోయిన కూరగాయలను వేయడం, పరిసరాలను అపరిశుభ్రం చేయటం నేరమని వారిని మందలించారు. మరోసారి పరిసరాలను అపరిశుభ్రం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వారిని హెచ్చరించారు.

వీధి వ్యాపారుల దుకాణాల నిర్వహణపై నిరంతరం పర్యవేక్షణ ఉంచాలని శానిటేషన్ విభాగం సిబ్బందిని కమిషనర్ ఆదేశించారు.

పి.ఆర్.ఓ.
నెల్లూరు నగరపాలక సంస్థ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *