
*ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందుకున్న ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కమిషనర్*
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందుకున్న ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు స్థానిక ఆత్మకూరు బస్టాండు ఫ్లైఓవర్ సాయిబాబా టెంపుల్ సమీపంలోని సర్వేపల్లి కాలువపై ఉన్న పాదచారుల వంతెన ప్రాంతాన్ని మంగళవారం సందర్శించారు.
పాదాచారుల వంతెనపై నిర్మించిన గడ్డర్లను తొలగించి ద్విచక్ర వాహనాలు రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకోవాలన్న స్థానికుల విజ్ఞప్తిని పరిశీలిస్తామని కమిషనర్ స్పష్టం చేశారు.